కోల్కతా : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్ ఐపీఎల్కు అందుబాటులో ఉండడని జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల సమయం పడుతుందని దవాఖాన వర్గాలు తెలిపాయి. పంత్ లేకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్కు శరాఘాతమని గంగూలీ అన్నాడు. ఈ ఏడాది స్వదేశం వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి పంత్ సిద్ధమవుతాడని అతడి సన్నిహితులు తెలిపారు.