Rishabh Pant : ఒంటి చేత్తో అలవోకగా సిక్సర్లు బాదే భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్కు అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే.. కారు యాక్సిడెంట్లో గాయం కారణంగా అతను కొన్నాళ్లుగా ఆటకు దూరమయ్యాడు. అలాంటిది అతనికి వాలెంటైన్స్ డే రోజున ఊహించని కానుకలు అందాయి. అవి కూడా తనను ఎంతగానే అభిమానించే యంగ్ ఫ్యాన్స్ నుంచి. కొందరు పిల్లలు త్వరగా కోలుకోవాలని చేతితో రాసిన ఉత్తరాలను పంత్కు పంపించారు. కొందరేమో బొమ్మలు గీసి పంపారు. వాటిని చూసిన పంత్ చాలా సంతోషించాడు.
చిన్నారి అభిమానులు తనకు పంపిప లెటర్స్ను పంత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాడు. ‘పిల్లలు నాపై చూపిస్తున్న ప్రేమ అద్భుతం’ అని ఆ ఫొటోలకు పంత్ క్యాప్షన్ రాశాడు. ఈమధ్యే పంత్ ఇన్స్టాలో కర్రల సాయంతో నడుస్తున్న ఫొటోలు షేర్ చేశాడు.
పోయిన ఏడాది డిసెంబర్ 30న ఉదయం 5 గంటలకు పంత్ డ్రైవింగ్ చేస్తున్న కారు రూర్కీ వద్ద ప్రమాదానికి గురైంది. కారులో మంటలు చెలరేగాయి. అయితే.. కారు అద్దాన్ని పగలగొట్టి పంత్ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న పంత్ను ఆర్టీసీ డ్రైవర్, మరో వ్యక్తి బటయకు లాగారు. ఆ తర్వాత అతడిని ఉత్తరాఖండ్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్లో పంత్ మోకాలికి సర్జరీ చేశారు. దాంతో, అతను కర్రల సాయంతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు.
రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. దాంతో పంత్ ఈ ఏడాది చాలావరకు క్రికెట్కు దూరం కానున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ ఆడడం లేదు. అంతేకాదు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలకమైన టోర్నీలు ఉన్నాయి. ఆలోపు పంత్ ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అనేది తెలియదు. ప్రధాన టోర్నీలలో ధాటిగా ఆడే పంత్ లాంటి ప్లేయర్ జట్టులో లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటు.