ముంబై: టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు సారథిగా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్కు భారత వన్డే జట్టులోనూ చోటు దక్కేలా లేదు. ఇప్పటికే టీ20 టీమ్కు దూరమైన అతడిని.. వన్డేల నుంచీ తప్పించి ఆ స్థానాన్ని కేరళ కుర్రాడు సంజూ శాంసన్తో భర్తీ చేయాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
రాబోయే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా జట్టును తయారుచేసుకునే ప్రణాళికలో భాగంగానే శాంసన్కు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తున్నది. టీ20 వరల్డ్కప్ నాకౌట్ దశలో సంచలన ఆటతో భారత్ వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ.. ఐపీఎల్-19లో చెన్నైకి ఆడుతూ 8 మ్యాచుల్లో 304 రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. మరోవైపు పంత్.. 8 మ్యాచుల్లో 189 రన్స్ మాత్రమే చేశాడు. వన్డేల్లో వేటు పడ్డా పంత్ టెస్టుల్లో ఫస్ట్ చాయిస్ వికెట్కీపర్గా ఉన్నాడు.