Rishabh Pant | టీమ్ఇండియా (Team India) అభిమానులకు గుడ్ న్యూస్. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్కు దూరమైన టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తొలిసారి బ్యాటింగ్ చేసినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్లో పంత్ బ్యాటింగ్ చేస్తూ.. భారీ షాట్లు కొట్టాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ సంస్థ నిర్వహించింది.
Rishabh Pant’s batting practice, recovery has been excellent.
– Great news for Indian cricket. pic.twitter.com/KThpdkagDz
— Johns. (@CricCrazyJohns) August 16, 2023
గతేడాది డిసెంబర్ 30వ తేదీన పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో పంత్ తిరిగి ఎప్పుడు జట్టులోకి చేరుతాడా..? అంటూ అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంత్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరిగి తన ఆటను మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.