న్యూఢిల్లీ: శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎవరు సారథ్యం వహిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా ఫుల్ఫామ్లో ఉన్న భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం మంగళవారం వెల్లడించింది. రహానే, శిఖర్ ధవన్, స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నా.. మరోసారి యువరక్తానికే ప్రాధా న్యం ఇస్తూ రిషబ్ను సారథిగా ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో గాయపడిన శ్రేయస్.. ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.
ఇవీ కూడా చదవండి