ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant) విషయంలో.. ఇటీవల మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వివాదాస్పద కామెంట్ చేశారు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో.. ఢిల్లీ జట్టు కెప్టెన్గా పంత్ను రిటేన్ చేయాలని యోచిస్తున్నది. కానీ డబ్బు అంశంలో రిషబ్ పంత్ మరో జట్టును ఆశ్రయించనున్నట్లు గవాస్కర్ పేర్కొన్నారు. రిటెన్షన్ ఫీజు దృష్ట్యా ఢిల్లీ ఫ్రాంచైజీని వదులుకునేందుకు పంత్ రెఢీ అయినట్లు గవాస్కర్ ఆరోపించారు.
The curious case of Rishabh Pant & Delhi! 🧐
🗣 Hear it from #SunilGavaskar as he talks about the possibility of @RishabhPant17 returning to the Delhi Capitals!
📺 Watch #IPLAuction 👉 NOV 24th & 25th, 2:30 PM onwards on Star Sports Network & JioCinema! pic.twitter.com/ugrlilKj96
— Star Sports (@StarSportsIndia) November 19, 2024
ఆటగాళ్ల వేలం గురించి స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో గవాస్కర్ ఆ కామెంట్ చేశారు. వేలంలో తమ విలువను గ్రహించిన ఆటగాళ్లు తమ స్వంత ఫ్రాంచైజీలను వదిలి వెళ్తుంటారని గవాస్కర్ పేర్కొన్నారు. రిషబ్ పంత్ కేసు కూడా ఇలాంటిదే అని తెలిపారు. కానీ పంత్ను రిటేన్ చేసుకునేందుకు ఢిల్లీ జట్టు ప్రయత్నిస్తుందని గవాస్కర్ అంచనా వేశారు. చాలా వరకు జట్లలో రిటేన్ చేసుకున్న ఆటగాళ్లు ఫీజు పెరిగిందని, అంటే ఫీజు విషయంలో పంత్ వెనుకడుగు వేసి ఉంటారని గవాస్కర్ తెలిపారు.
ఢిల్లీ జట్టుకు కెప్టెన్ కూడా లేడు కాబట్టి, కచ్చితంగా ఆ జట్టు పంత్ను సొంతం చేసుకుంటుందన్నారు. అయితే డబ్బు విషయంలో జట్టుకు దూరం అవుతున్నట్లు వచ్చిన వార్తలను పంత్ ఖండించారు. గవాస్కర్ వీడియోను ఉద్దేశిస్తూ పంత్ ఈ విషయాన్ని చెప్పారు. డబ్బు కోసం ఢిల్లీని వీడడం లేదన్నాడు. తనను రిటేన్ చేసుకునే అంశం డబ్బుతో ముడిపడి లేదని పంత్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
ప్రస్తుతం పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దీంతో అతన్ని సొంతం చేసుకోవాలని అన్ని ఐపీఎల్ జట్లు చూస్తున్నాయి.పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ గెయింట్స్, ఆర్సీబీ కూడా పంత్ కోసం పంతం పట్టేలా ఉన్నాయి.