విశాఖపట్టణం: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant)కు భారీ ఫైన్ వేశారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి జరిమానా విధించారు. లీగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లీగ్ చట్టం ప్రకారం రిషబ్ పంత్కు 12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. రిషబ్ పంత్ ఆ మ్యాచ్లో 32 బంతుల్లో 51 రన్స్ చేసి తన ఫామ్ను చాటుకున్నాడు. అయితే కెప్టెన్గా స్లో ఓవర్ రేట్ వేసినందుకు అతనికి జరిమానా వేశారు. ఐపీఎల్ దీనిపై ప్రకటన జారీ చేసింది. లీగ్లో తొలి తప్పుగా భావిస్తున్నట్లు పేర్కొన్నది.