డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమ్ఇండియా వికెట్కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతడు వేగవంతంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. శ్రీలంకతో సిరీస్కు దూరమైన పంత్.. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలకు ఉత్తరాఖండ్ వెళ్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పంత్ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్కు చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపాడు. ‘ఢిల్లీ నుంచి ఓ బృందం డెహ్రాడూన్లోని దవాఖానకు వెళ్లి రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్లాస్టిక్ సర్జారీ అవసరం కావడంతో అక్కడే వైద్యం అందించారు. బీసీసీఐ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నది’ అని ఆయన అన్నారు.