Rishabh Pant | వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత రెండో వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు సాధించిన రెండో భారత వికెట్ కీపర్గా పంత్ గుర్తింపు పొందాడు. బంగ్లాదేశ్లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో పంత్ ఈ ఘనత సాధించాడు. మ్యాచ్లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్లో స్టంపవుట్ కావడంతో వెనుదిరిగాడు.
కాగా, 535 అంతర్జాతీయ మ్యాచుల్లో ధోనీ 17,092 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్ రేటు సగటు 44.74గా ఉంది. ఇందులో 15 శతకాలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రిషబ్ పంత్ ఇప్పటి వరకు 128 మ్యాచ్లకు గానూ 4,021 పరుగులు సాధించాడు. పంత్ స్ట్రైక్ రేటు సగటు 33.78గా ఉంది.