న్యూఢిల్లీ: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడయ్యాడు. క్రీడలు, ప్రజారోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు పంత్ను ప్రచారకర్తగా నియమిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఉత్తర్వులు జారీ చేశారు. ‘బ్రాండ్ అంబాసిడర్గా అవకాశం ఇచ్చిన సీఎం పుష్కర్ ధామికి ధన్యవాదాలు. నా శక్తి మేర క్రీడలు, ఫిట్నెస్పై మరింత అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తా. ధృడ భారత్కు మీరు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది’ అని పంత్ ట్వీట్ చేశాడు.