కోల్కతా: ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్(KKR) జట్టు రెఢీ అవుతోంది. అయితే మంగళవారం జరిగిన సెకండ్ వార్మప్ మ్యాచ్లో.. రింకూ సింగ్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. ప్రాక్టీస్ కోసం కోల్కతా జట్టు..టీమ్ గోల్డ్, టీమ్ పర్పుల్ గా పోటీ పడింది. టీమ్ గోల్డ్ తరపున రింకూ ఆడాడు. ఇక పర్పుల్ తరపున మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశాడు. ఆరంభంలో టీమ్ గోల్డ్ను ఇబ్బంది పెట్టిన స్టార్క్.. చివరి ఓవర్లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
గాయం కారణంగా దశాబ్ధ కాలం నుంచి ఐపీఎల్కు స్టార్క్ దూరంగా ఉన్నాడు. అయితే బౌలింగ్లో వీక్గా ఉన్న కేకేఆర్ జట్టు.. ఈ సారి అతన్ని 24.75 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నది. తమ బౌలింగ్ యూనిట్ను బలంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో స్టార్క్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. తొలి ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చిన స్టార్క్.. ఆ తర్వాత కొంత తడబడ్డాడు. ఇక అతను వేసిన చివర్ ఓవర్లో రింకూ సింగ్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. స్టార్క్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
శనివారం సన్రైజర్స్తో జరిగే మ్యాచ్లో స్టార్క్ ఎలా తన సత్తా చాటుతాడో చూడాల్సిందే.
Rinku Singh smashed a SIX to Mitchell Starc 🍿💥
This is Cinema!! pic.twitter.com/zQNhfPrqSR
— कट्टर KKR समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 19, 2024