రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఇరానీ కప్ ఫైనల్లో రెస్ట్ ఆఫ్ ఇండియా విజయం సాధించింది. 2019-20 రంజీ చాంపియన్ సౌరాష్ట్రపై 8 వికెట్ల తేడాతో రెస్ట్ ఆఫ్ ఇండియా గెలిచింది. నాలుగవ రోజు కేవలం 105 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా ఈజీగా లక్ష్యాన్ని అందుకున్నది. రెండవ ఇన్నింగ్స్లో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అజేయంగా 63 రన్స్ చేశాడు. నిజానికి సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 89 రన్స్ చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియా 374 (సర్ఫరాజ్ 138, విహారి 82, సాకరియా 5-93), 105-2 (అభిమన్యు 63, ఉనద్కత్ 2-37)
సౌరాష్ట్ర 98 (ముకేశ్ 4-23, మాలిక్ 3-25, సేన్ 3-41), 380 (ఉనద్కత్ 89, మన్కడ్ 72, జాక్సన్ 71, సేన్ 5-94, సౌరభ్ 3-80)
Winners Are Grinners! ☺️ 🙌
Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia
Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP
— BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022