ముంబై: ఐపీఎల్(IPL) సీజన్ వచ్చేసింది. శుక్రవారం నుంచి ఈ యేటి టోర్నీకి రంగం సిద్దమైంది. ఇక టోర్నీలో మరోసారి ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు తన సత్తా చాటేందుకు సిద్దంగా ఉంది. మేటి ప్లేయర్లతో పటిష్టంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ రిలయన్స్ డిజిటల్స్(Reliance Digital) సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు అఫిషియల్ పార్ట్నర్గా రిలయన్స్ డిజిటల్స్ కొనసాగనున్నది. ఎంఐ జట్టు కిట్స్పై ఇక రిలయన్స్ డిజిటల్ బ్రాండ్ కనిపిస్తుంది.
ముంబై ఇండియన్స్తో డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ డిజిటిల్ తమ కస్టమర్ల కోసం కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తోంది. రిలయన్స్ డిజిటల్స్ స్టోర్లు కానీ లేక సోషల్ మీడియా పేజీలను విజిట్ చేసేవాళ్లకు మ్యాచ్ టికెట్లు(Match tickets) గెలిచే అవకాశాన్ని కల్పిస్తోంది. డిజిటల్ డిస్కౌంట్ డేస్ సమయంలో.. కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు(discounts) కూడా ఇవ్వనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆ డిస్కౌంట్స్ వర్తిస్తాయి.