బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (21) అవుటయ్యాడు. మ్యాక్స్వెల్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన ధవన్.. ఆ తర్వాత మళ్లీ బ్యాటు ఝుళిపించలేకపోయాడు. ఆ ఓవర్ చివరి బంతికి స్లాగ్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే మరో ఓపెనర్ జానీ బెయిర్స్టో (22 బంతుల్లో 59 నాటౌట్) ధాటిగా ఆడుతుండటంతో పంజాబ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. క్రీజులో బెయిర్స్టోతోపాటు రాజపక్స ఉన్నాడు. పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది.