ఈ ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ప్లేఆఫ్స్కు అధికారికంగా వెళ్లాలంటే మరో గెలుపు కావాలి. అదే సమయంలో మిగతా మ్యాచులన్నీ భారీ తేడాతో గెలిస్తే పంజాబ్కు కూడా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆర్సీబీ, పీబీకేఎస్ జట్లు బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు సారధి డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులూ లేవని అతను వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్స్టో, శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రర్, అర్షదీప్ సింగ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోష్ హాజిల్వుడ్
🚨 Toss Update 🚨@RCBTweets have elected to bowl against @PunjabKingsIPL.
Follow the match ▶️ https://t.co/jJzEACTIT1 #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/xyx7pc62X3
— IndianPremierLeague (@IPL) May 13, 2022