పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు మరో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి యువ ఆటగాడు రజత్ పటీదార్ (26) పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్లో ఒక్క భారీ షాట్ కూడా లేకపోవడంతో ఒత్తిడికి గురైన అతను.. చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ఆఫ్సైడ్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా బౌండరీకి తరలించేందుకు ట్రై చేశాడు. అయితే బంతి సరిగే కనెక్ట్ కాలేదు. బ్యాటు చివర్న తగిలిన బంతి.. పూర్తి దూరం ప్రయాణించలేదు. దీంతో లాంగాన్లో శిఖర్ ధవన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతను అవుటైన కాసేపటికే కుదురుకున్నాడని అనుకున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (35) కూడా అవుటయ్యాడు.
హర్ప్రీత్ బ్రార్ వేసిన బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించిన మ్యాక్స్వెల్.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్కు చిక్కాడు. దీంతో 104 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా వంద పరుగులపైగా చేయాల్సి ఉంది.