భారీ లక్ష్య ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన విరాట్ కోహ్లీ (20) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి అతను అవుటయ్యాడు. రబాడ వేసిన లెంగ్త్ బాల్ను పుల్ చేయడానికి కోహ్లీ ప్రయత్నించాడు. అయితే అతను కొంచెం లేట్ అవడంతో.. బంతి కోహ్లీ నడుముకు తగిలి గాల్లోకి లేచింది.
దాన్ని ఫైన్ లెగ్లో ఉన్న చాహర్ చక్కగా అందుకున్నాడు. అయితే అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో పంజాబ్ జట్టు రివ్యూ కోరింది. రివ్యూలో బంతి కోహ్లీ గ్లవ్ను చాలా చిన్నగా ముద్దాడినట్లు తేలింది. దాంతో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. బెంగళూరు జట్టు 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.