ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ వంటి ఆటగాడు జట్టు కోసం ఏమీ చేయలేకపోతున్న తరుణంలో కూడా ఆ జట్టు బాగా రాణించిందని, దాదాపు ప్లేఆఫ్స్ చేరిందని కితాబిచ్చాడు. కోహ్లీ 20 కన్నా తక్కువ సగటుతో పరుగులు చేస్తున్నాడని గుర్తుచేసిన వాగన్.. ‘‘ఒకవేళ కోహ్లీ కూడా ఫామ్ అందుకున్నాడనుకోండి. డుప్లెసిస్, మ్యాక్స్వెల్, కోహ్లీ ఫామ్లో ఉంటే ఆ జట్టు చాలా డేంజరస్గా మారుతుంది.
అప్పుడు వాళ్లను గెలవడం చాలా కష్టం’’ అని మెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో మూడుసార్లు డకౌట్ అయిన కోహ్లీ.. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చివరగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అతను తొలి బంతికే పెవిలియన్ చేరాడు. కానీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తోపాటు యువ ఆటగాడు రజత్ పటీదార్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తీక్ రాణించారు. దానికితోడు బౌలింగ్లో హసరంగ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో బెంగళూరు ఘనవిజయం సాధించింది.