బెంగళూరు: ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో కోల్కతా విజయం సాధించింది. ఈ సీజన్లో ఇది 36వ మ్యాచ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి నాలుగు ఓడి నాలుగు విజయాలు సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 మ్యాచ్లు ఆడింది. మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఐదు మ్యాచ్లు ఓడిపోయింది.
బెంగళూరుపై 21 పరుగుల తేడాతో కోల్కతా విజయం సాధించింది. 201 పరుగులు విజయలక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేయగలిగింది. మొదట్లో దూకుడుగా ఆడిన బెంగళూరుకు కోల్కతా బౌలర్లు ముచ్చెమటలు పట్టించారు. వరుసగా వికెట్లు తీసి బెంగళూరును కోలుకోలేకుండా చేశారు. దీంతో 179 పరుగులు మాత్రమే చేయగలిగింది.
వరుస వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు ఓటమి అంచున నిలిచింది. 18 ఓవర్ ముగిసే సమయానికి బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వరుణ్ బౌలింగ్లో దినేశ్ కార్తీక్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవయ్యాడు.
15 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. చివరి బంతికి సుయాశ్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటయ్యాడు. క్రీజులో దినేశ్ కార్తీక్ (13) ఉన్నారు. విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ ఔటయిన తర్వాత బెంగళూరు స్కోరు నెమ్మదించింది. 15వ ఓవర్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. సుయాశ్ ఔటయ్యాడు.
దూకుడుగా ఆడుతున్న మహిపాల్ లోమ్రోర్ ( 34 ), విరాట్ కోహ్లీ (54) ఔటయ్యారు. వరుణ్ బౌలింగ్ లో భారీ షాట్కు ప్రయత్నించిన మహిపాల్.. రస్సెల్కు చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఆండ్రూ రస్సెల్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. దీంతో బెంగళూరు కష్టాల్లో పడింది. 13 ఓవర్ ముగిసే సమయానికి బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే 42 బంతుల్లో 80 పరుగులు చేయాలి. మరో ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి.
ఇన్నింగ్స్ తొలిబంతికే ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ 32 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. తొలి రెండు వికెట్లు తీసిన సుయాశ్ బౌలింగ్లో ఐదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఆచి తూచి ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేశాడు.
మొదట్లో దూకుడుగా ఆడిన బెంగళూరు వరుస వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కోహ్లీ (44 ) , మహిపాల్ లోమ్రోర్ (27 ) క్రీజులో ఉన్నారు. పదో ఓవర్లో మహిపాల్ తొలి, చివరి బంతిని సిక్సర్లుగా మలిచాడు. మొత్తం మీద పదో ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.
భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు దూకుడుగా ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఇప్పటికే డూప్లిసెస్, షాబాజ్ అహ్మద్ ఔట్ అవగా.. ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ (5) కూడా ఔటయ్యాడు. వరుణ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి వైజ్కి దొరికిపోయాడు. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
4.4 ఓవర్ల వద్ద సుయాశ్ బౌలింగ్లో షాబాజ్ అహ్మద్ (2) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. సుయాశ్ అద్భుత బౌలింగ్తో బెంగళూరును బెంబేలెత్తించాడు. డూప్లిసస్తో పాటు షాబాజ్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు బ్యాటర్లు తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో భారీ షాట్కు ప్రయత్నించిన డూప్లెసిస్ .. సుయాశ్ బౌలింగ్లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అంతకుముందు ఉమేష్ యాదవ్ బౌలింగ్లో డూప్లిసెస్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కాగా, మూడో ఓవర్ ముగిసే సమయానికి బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది.
201 పరుగుల విజయలక్ష్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలో దిగింది. విరాట్ కోహ్లీ, డూప్లిసెస్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి బంతికే కోహ్లీ ఫోర్ కొట్టాడు. అటు డూప్లెసిస్ కూడా ఐదో బంతిని ఫోర్గా మలిచాడు. మొత్తంగా ఇద్దరూ తొలి ఓవర్లో 11 పరుగులు రాబట్టారు.
కోల్కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 56 పరుగులు, కెప్టెన్ నితీశ్ రాణా 48 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 31 పరుగులు, జగదీశన్ 27 పరుగులు, రింకూ సింగ్ 18 పరుగులు, డేవిడ్ వీజ్ 12 పరుగులు చేశారు.
కోల్కతా టీమ్ 19 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రింకూ సింగ్ తొలి బంతిని సిక్సర్గా మలిచి, తర్వాత రెండు బంతులు బౌండరీలు బాదాడు. దాంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి ఆండ్రూ రస్సెల్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్కు 18వ ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హసరంగ బౌలింగ్లో కెప్టెన్ నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ వెంటవెంటనే ఔటయ్యారు. అప్పటికి కోల్కతా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులకు చేరింది.
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా 17వ ఓవర్ ఆఖరి నాలుగు బంతుల్లో బౌండరీల మోత మోగించాడు. వరుస బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దాంతో కోల్కతా స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 167 పరుగులకు చేరింది.
కోల్కతా కెప్టెన్ నితీశ్ రాణా 16వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దాంతో ఆ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. కోల్కతా స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులకు చేరింది.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 15 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ రాయ్ ఔటయినప్పటి నుంచి కేకేఆర్ స్కోర్ బోర్డు నత్త నడకన సాగుతోంది.
కోల్కతా టీమ్ 14 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అయ్యర్ 20, రాణా 18 పరుగులతో ఉన్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరూ ఒకేసారి ఔట్ కావడంతో నెమ్మదించిన స్కోర్ బోర్డును వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా తిరిగి పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు.
కేకేఆర్ జట్టు 12 ఓవర్ల ఆట ముగిసే సమాయానికి రెండు వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 15 పరుగులు, నితీశ్ రాణా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 4, నితీశ్ రాణా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోల్కతా టీమ్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లోనే జాసన్ రాయ్ కూడా ఔటయ్యాడు. 10వ ఓవర్ ఆఖరి బంతికి బ్యాట్తో బెయిల్స్ను కొట్టుకుని పెవిలియన్కు చేరాడు. అప్పటికే కోల్కతా స్కోర్ 88/2.
కోల్కతా టీమ్ 10వ ఓవర్ రెండో బంతికి తొలి వికెట్ కోల్పోయింది. ఎన్ జగదీశన్ విజయ్కుమార్ వైశాఖ్ బౌలింగ్లో విల్లేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అప్పటికి జగదీశన్ 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 9 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 55 పరుగులు, ఎన్ జగదీశన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ తొలి 8 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. జాసన్ రాయ్, ఎన్ జగదీశన్ క్రీజులో ఉన్నారు.
KKR బ్యాటర్ జాసన్ రాయ్ 8వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్లతో రాయ్ అర్ధసెంచరీ చేశాడు. అప్పటికి జట్టు స్కోర్ 69/0.
ఆరు ఓవర్లో జాసన్ రాయ్ సిక్సర్ల మోతతో 25 పరుగులు పిండుకున్న కేకేఆర్ టీమ్.. ఏడు ఓవర్లో మాత్రం కేవలం రెండు పరుగులే చేయగలిగింది. జాసన్ రాయ్ 49 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.
ఆరో ఓవర్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ జాసన్ రాయ్ సిక్సర్ల మోత మోగించాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో తొలి బంతికి జగదీశ్న్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత 2,3,4 బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచిన జాసన్ రాయ్ 5వ బంతికి పరుగులేమీ చేయలేదు. ఆరో బంతికి మరో సిక్సర్ బాదాడు. దాంతో ఆరో ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. జట్టు స్కోర్ 66 పరుగులకు చేరింది.
నాలుగో ఓవర్లో ఏకంగా 17 పరుగులు రాబట్టిన కోల్కతా బ్యాటర్లు ఐదో ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగారు. దాంతో ఐదు ఓవర్లలో కోల్కతా స్కోర్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులకు చేరింది.
తొలి మూడు ఓవర్లు నిదానంగా ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు నాలుగో ఓవర్లో జూలు విదిల్చారు. ఈ ఓవర్లో జగదీశన్ రెండు బౌండరీలు బాది ఒక సింగిల్ తీయగా, జాసన్ రాయ్ ఒక సిక్సర్ బాది ఒక సింగిల్ తీశాడు. వైడ్ రూపంలో ఒక పరుగు వచ్చింది.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ తొలి మూడు ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. జాసన్ రాయ్, ఎన్ జగదీశన్ క్రీజులో ఉన్నారు.
తొలి రెండు ఓవర్ల ఆట ముగిసే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, విజయ్కుమార్ వైశాఖ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్.
కోల్కతా నైట్ రైడర్స్: ఎన్ జగదేశన్ (వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వీజ్, వైభవ్ అరోరా, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ టీమ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.