బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్వెల్ వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో మాథ్యూ వేడ్ (16) అవుటయ్యాడు. అప్పటి వరకు ధాటిగా ఆడిన వేడ్.. మ్యాక్స్వెల్ వేసిన బంతిని స్వీప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతని బ్యాట్ను మిస్ అయిన బంతి నేరుగా వెళ్లి ప్యాడ్లను తాకింది.
అప్పీల్ చేయగా ఆలోచించిన అంపైర్ అవుటిచ్చాడు. కానీ వేడ్ ఆ నిర్ణయాన్ని అంగీకరించలేదు. రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి అతని బ్యాటునుకానీ, గ్లవ్ను కానీ తాకలేదని తేలింది. అలాగే నేరుగా వికెట్లను తాకుతున్నట్లు కనిపించింది.
దాంతో జట్టు స్కోరు 38 పరుగుల వద్ద వేడ్ నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో పవర్ప్లే ముగిసే సరికి గుజరాత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులతో నిలిచింది.