గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. జట్టుకు శుభారంభం అందించిన కెప్టెన్ డుప్లెసిస్ (44) హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్ విఫలమయ్యాడు.
దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి కవర్స్ దిశగా వెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా సులభమైన క్యాచ్ పట్టేయడంతో డుప్లెసిస్ మైదానం వీడాల్సి వచ్చింది. కోహ్లీతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత డుప్లెసిస్ అవుటయ్యాడు. బెంగళూరు విజయానికి ఇంకా 49 పరుగులు అవసరం ఉన్నాయి.