బెంగళూరు: త్వరలో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు ఆ యాజమాన్యం శుభవార్త చెప్పింది. తమ సొంత మైదానమైన చిన్నస్వామిలో ఆర్సీబీ మ్యాచ్లు ఆడుతుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ.. రాబోయే సీజన్లో భాగంగా లీగ్ దశలో ఇక్కడ ఐదు మ్యాచ్లు ఆడేందుకు తమకు అనుమతి లభించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడే జట్లు.. తమ సొంత మైదానంలో 7, ప్రత్యర్థుల వేదికల్లో 7 మ్యాచ్లు ఆడతాయి. అయితే లీగ్ దశలో ఐదు మ్యాచ్లను చిన్నస్వామిలో ఆడే ఆర్సీబీ.. రెండు మ్యాచ్లను మాత్రం రాయ్పూర్ (ఛత్తీస్గఢ్)లో ఆడనుంది. దీని ప్రకారం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కూడా చిన్నస్వామిలోనే (సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ తమ హోంగ్రౌండ్లో తొలి మ్యాచ్ ఆడుతుంది) జరుగనుంది. లీగ్ దశ ముగిశాక ప్లేఆఫ్స్లో ఒకటి, ఫైనల్ కూడా చిన్నస్వామిలోనే జరుగుతుందా? లేదా? అన్నదానిపై పూర్తి షెడ్యూల్ వెలువడితే గానీ స్పష్టత రాదు. టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ల (ఈనెల 5) తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.