RCB vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఎనిమిదో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగున ఉంది. స్మృతి మంధాన, ఎలీసా పెర్రీ, సోఫీ డెవినే, రీచా ఘోష్ వంటి స్టార్టు ఉన్నా కూడా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోతోంది. బ్రబౌర్న్ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచుల్లో స్మృతి మంధాన టీమ్ ఓటమి పాలైంది. మరి ఈ గేమ్లోనైనా మంధాన సేన మెరుస్తుందా? ఖాతా తెరుస్తుందా? అనేది చూడాలి.
ఆర్సీబీ జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ డెవినే, హీథర్ నైట్, దిశా కసాత్, ఎలిసే పెర్రీ, కనికా అహుజా, అషా శోభన, ప్రీతీ బోస్, మేగన్ షట్, రేణుకా ఠాకూర్.
యూపీ వారియర్స్ జట్టు : అలిసా హేలీ(వికెట్ కీపర్), శ్వేతా షెరావత్, కిరణ్ నవ్గిరే, తహ్లియా మెక్గ్రాత్, దీప్తీ శర్మ, సిమ్రాన్ షస్త్రక్, దేవికా వైద్యా, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిం ఇస్మాయిల్, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ జెయింట్స్పై ఉత్కంఠ పోరులో 11 పరుగుల తేడాతో స్మృతి మంధాన సేన మట్టికరిచింది. డబ్ల్యూపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే ఆ జట్టు ఇక ప్రతి మ్యాచ్ గెలవాలి. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది.