IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో సంచనాలు సృష్టిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) కీలక పోరుకు సిద్దమైంది. చావోరేవోలాంటి ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)తో డూప్లెసిస్ బృందం తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకోవడంపై మీడియాలో అసత్య కథనాలు ప్రచారమయ్యాయి.
బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(ViratKohli) భద్రతకు ముప్పు ఉందనే కారణంతో ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్ మానేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. బెంగళూరు టీమ్ మీడియా కాన్ఫరెన్స్తో పాటు ప్రాక్టీస్ సెషన్ రద్దుకు అహ్మదాబాద్ ఎండనే కారణమని తెలిసింది. దాంతో, అభిమానులు హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు.
One game at a time! 👊#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/aK1JQXjq5F
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024
పదిహేడో సీజన్లో ఆర్సీబీ జట్టు అనూహ్యంగా పుంజుకొని వరుసగా ప్రత్యర్థులకు షాకిస్తూ వస్తుంది. ఒకదశలో అట్టడుగున నిలిచిన బెంగళూరు వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అదరగొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన పోరులో 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 218 పరుగుల ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు పట్టువిడవకుండి పోరాడినా.. యశ్ దయాల్(Yash Dayal) ఆఖరి ఓవర్లో ఏడు రన్స్ ఇచ్చాడంతే. దాంతో బెంగళూరు జట్టు 9వ సారి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.
Hang it in the Louvre 😍
Virat ➡️ Ahmedabad ➡️ Entertainment 🍿#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/HqSzSEXBbD
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 22, 2024