ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా.. కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు. వరుస ఓటములతో అభిమానులను నిరాశ పరిచాడు. అయితే కొన్ని రోజుల క్రితం తన ఆటపై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ వదిలేస్తున్నానని ప్రకటించాడు. ఈ క్రమంలో మళ్లీ జట్టు పగ్గాలు ధోనీ చేతికే వచ్చాయి. ధోనీ కెప్టెన్సీలో తొలి మ్యాచ్ను భారీ తేడాతో గెలిచిన చెన్నై.. మరుసటి మ్యాచ్లో ఓడిపోయింది.
ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో జడ్డూ ఆడలేదు. అతను ఫిట్గా లేడని ధోనీ చెప్పాడు. ఇప్పుడు అదే కారణంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి జడేజా దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజాకు గాయమైంది. ఈ క్రమంలోనే తర్వాతి మ్యాచ్కు అతను దూరమయ్యాడు. దీన్ని పరిశీలించిన జట్టు ఫిజియోలు.. జడ్డూకు విశ్రాంతి కావాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జడేజా ఇక ఈ ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలుఉన్నాయని చెన్నై సూపర్ కింగ్స్ నిర్వాహకులు.