టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా వెస్టిండీస్తో తొలి రెండు వన్డేలకు దూరమయ్యాడు. విండీస్తో తొలి మ్యాచ్కు ముందు ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. రవీంద్ర జడేజా గాయాన్ని వైద్య బృందం పరిశీలిస్తుందని, మూడో వన్డేకు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది త్వరలో తెలుస్తుందని బీసీసీఐ పేర్కొంది.