Ravichandran Ashwin : భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)కు రామ్ లల్లా(Ram Lalla Idol) ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. తమిళనాడు బీజేపీ స్టేట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు శుక్రవారం చెన్నైలోని అశ్విన్ నివాసానికి వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారు. దాంతో, జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఈ స్టార్ స్పిన్నర్ పాల్గొననున్నాడు. ఇప్పటివరకూ రామ మందిరం ట్రస్టు సభ్యుల నుంచి నాలుగో క్రికెటర్లు ఇన్విటేషన్ అందుకున్నారు.
అశ్విన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు ఆహ్వాన పత్రిక ముట్టింది. అయితే.. ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపికైన భారత బృందంలోని మిగతా సభ్యులు ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జనవరి 25న తొలి టెస్టు ప్రారంభం కానుంది. అందుకని ప్రాక్టీస్ కోసం టీమిండియా సభ్యులు జనవరి 20న ఉప్పల్ చేరుకోవాల్సి ఉంటుంది.
51 అంగుళాల ఎత్తైన రామ్లల్లా విగ్రహం
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో శుక్రవారం బాల రాముడి నల్ల రాతి విగ్రహాన్ని పెట్టారు. 51 అంగుళాల ఎత్తైన రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రవేశ పెట్టారు. కండ్లకు గంతలు కట్టి ఉన్న రామ్ లల్లా ఫొటోను ట్రస్ట్ విడుదలు చేసింది. క్షణాల్లో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విగ్రహాన్ని మైసూర్కు చెందిన శిల్పి అరున్ యోగిరాజ్(Arun Yogiraj) రూపొందించాడు. జనవరి 22న మధ్యాహ్యం 12 గంటలకు కన్నులపండువగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది.