మొహాలి: భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజున క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ 434 టెస్టు వికెట్ల రికార్డును అశ్విన్ సమం చేశాడు. మరో వికెట్ తీస్తే భారత టెస్టు జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా తను రికార్డు సృష్టిస్తాడు. అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు ఇప్పటికీ స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే పేరు మీద ఉన్నది.
కాగా, 138/4 స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రీలంక జట్టు 174 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దాంతో భారత్ శ్రీలంకను ఫాలో ఆన్ ఆడిస్తున్నది. లంచ్ సమయానికి శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 10 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ తిరిమానే డౌకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే, పాతుమ్ నిస్సంక ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.