Ravi Shastri : ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) రాత మారలేదు. వరుసగా మూడో ఓటమితోముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ మెగా టోర్నీలో ఐదు టైటిళ్లు నెగ్గిన ముంబై.. అనామక జట్టులా మారడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ మార్పుతో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)పై మొదలైన ట్రోలింగ్ రోజురోజుకు పెరుగుతోంది. పాండ్యా ఎక్కడకు వెళ్లినా ఫ్యాన్స్ అతడిని హేళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ రవి శాస్త్రి(Ravi Shastri) ముంబై ఫ్యాన్స్కు ఓ రిక్వెస్ట్ చేశాడు.
‘మీరు ఎన్నో ఏండ్లుగా ముంబైని సప్టోర్ట్ చేస్తూ వస్తున్నారు. రెండు, మూడు మ్యాచ్లు ఓడగానే ముంబై చెత్త జట్టు కాదు. ఐదు సార్లు కప్పు కొట్టిన టీమ్. కొత్త కెప్టెన్ రాగానే ఆందోళన ఎందుకు. ఓపికగా ఉండండి. మీరు అంతగా హేళన చేస్తున్న పాండ్యా కూడా మీలాంటి మనిషే. అందరిలానే అతడు కూడా రాత్రిళ్లు హాయిగా నిద్రపోవాలిగా. అందుకనే కాస్త శాంతంగా ఉండండి’ అని ముంబై ఫ్యాన్స్ను శాస్త్రి కోరాడు.
పదిహేడో సీజన్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) నుంచి పాండ్యా ముంబైకి మారాడు. అంతేనా ఏకంగా కెప్టెన్గా ఎంపికయ్యాడు. దాంతో, రోహిత్ను సారథిగా తప్పించడంపై గుర్రుగా ఉన్న ముంబై ఫ్యాన్స్ పాండ్యాను ట్రోల్ చేయడం మొదలెట్టారు. అంతే.. నెట్టింట ‘రిఫ్ హార్దిక్ పాండ్యా’ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. అంతేకాదు.. పాండ్యా టాస్కు వెళ్లినా.. బ్యాటింగ్కు వచ్చినా.. స్టేడియంలోని ఫ్యాన్స్ రోహిత్ రోహిత్ అంటూ గట్టిగా అరుస్తున్నారు.
A sea of blue in मुंबई for our 1️⃣st home game of the season 💙➡️ https://t.co/BvsDvGe3yU
Watch the full video of today’s #MIDaily on our website & MI app 📹💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/mgC4khtlzA
— Mumbai Indians (@mipaltan) April 2, 2024
ఇక గుజరాత్ టైటాన్స్తో తొలి పోరులో అయితే మైదానంలోకి ఒక కుక్క రాగానే.. అందరూ పాండ్యా.. పాండ్యా అంటూ మొత్తుకున్నారు. అనంతరం హైదరాబాద్లోనూ అదే పరిస్థితి. సొంతమైదానమైన వాంఖడేలోనే ముంబై ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాను వదల్లేదు. ‘ముంబై కా రాజా రోహిత్’ అంటూ పాండ్యాను గేలి చేశారు. అంతేకాదు మళ్లీ హిట్మ్యాన్కే ముంబై పగ్గాలు అప్పగించాలని అరిచారు. అయితే.. కామెంటేటర్ హర్హ భోగ్లే నిశబ్దంగా ఉండాలంటూ అభిమానులకు సూచించాడు.