హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక ఆకట్టుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6-3, 7-5 తేడాతో రెండో సీడ్ జీల్ దేశాయ్పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి దూకుడు కనబరిచిన రష్మిక..తన కంటే మెరుగైన సీడింగ్లో ఉన్న దేశాయ్ను వరుసగా రెండు సెట్లలో ఓడించి టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించింది.