కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ కోసం టీమ్ను ఎంపిక చేసిన అరగంటలోపే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. టీమ్ ఎంపిక చేసే ముందు సెలక్షన్ కమిటీగానీ, క్రికెట్ బోర్డుగానీ తనను సంప్రదించలేదని రషీద్ ఆరోపించాడు. రషీద్ తప్పుకోవడంతో ఆల్రౌండర్ మహ్మద్ నబీ కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రషీద్ కెప్టెన్సీలోనే టీమ్ను ఎంపిక చేసినట్లు క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
అయితే ఆ వెంటనే రషీద్ తీసుకున్న ఈ నిర్ణయం బోర్డును షాక్కు గురి చేసింది. ఈ మధ్య కాలంలో టీమ్ లేని కొంతమంది ప్లేయర్స్ను కమిటీ ఎంపిక చేసింది. అంతేకాదు ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మంది ప్లేయర్స్నే ఎంపిక చేయాల్సి ఉన్నా.. ఏసీబీ మాత్రం 18 మందిని ఎంపిక చేసింది. అందులో ఇద్దరు మాత్రమే రిజర్వ్ ప్లేయర్స్ ఉన్నారు. రషీద్ఖాన్ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంతోపాటు ఇలా నిబంధనలను పాటించకపోవడంతో ఆఫ్ఘన్ టీమ్లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.