ముంబై: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్.. క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీ20 క్రికెట్ లీగ్లో అతనో స్పెషల్ ప్లేయర్గా మారాడు. ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఐపీఎల్లోనూ స్టార్ అట్రాక్షన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ లెగ్ స్పిన్నర్ ఇటీవల ఓ బుక్ రాశాడు. రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ అనే బుక్లో తన అనుభవాలు పంచుకున్నాడతను. 2023 ఐపీఎల్ సీజన్ సమయంలో జరిగిన ఓ ఘటనను ఆ బుక్లో అతను గుర్తు చేశాడు. ఓ టీమ్ అధికారితో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. భారత క్రికెట్కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం అయ్యిందని, అతనితో మాట్లాడుతున్న సమయంలో తనకు ఓ ఆఫర్ వచ్చినట్లు రషీద్ ఖాన్ తెలిపాడు.
ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు బాగా లేవని, భారత్కు వచ్చి ఇక్కడే ఉండిపోవాలని ఆ వ్యక్తి తనను కోరినట్లు రషీద్ బుక్లో రాశాడు. భారత పౌరసత్వాన్ని ఇప్పిస్తామని, ఇక్కడ ఉండి, క్రికెట్ ఆడుకోవచ్చు అన్నారని పేర్కొన్నారు. కానీ ఆ అధికారి ఇచ్చిన ఆఫర్తో ఆశ్చర్యపోయినట్లు రషీద్ ఖాన్ తెలిపాడు. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదని, ఓ నవ్వు నవ్వి ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పాడు. తన దేశం ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడుతున్నట్లు చెప్పాననన్నాడు.
ఇండియా ఒక్కటే కాదు, ఆస్ట్రేలియా నుంచి కూడా తనకు సిటిజన్షిప్ ఆఫర్ వచ్చినట్లు రషీద్ పేర్కొన్నాడు. ఒకవేళ తాను తన దేశానికి ఆడలేకపోతే, అప్పుడు ఇక ఏ దేశం తరపున కూడా తాను ఆడలేన్న విషయాన్ని వారికి చెప్పినట్లు రషీద్ తన బుక్లో రాశాడు.