న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులో ప్రముఖ సినీ జంట దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ పోటీ పడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త జట్లు చేరుతుండడంతో ఒక జట్టును దక్కించుకునేందుకు ఈ జంట బిడ్డింగ్ రేసులో నిలబడుతున్నది. ఈనెల 25న టెండర్ల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ప్రీతిజింటా, షారూక్ఖాన్ భాగమవగా ఇప్పుడు వారి సరసన దీపిక, రణ్వీర్ చేరుతుండడం విశేషం. ఈ ఫ్రాంచేజ్ల కోసం అదానీ, గోయెంక, మాంచెస్టర్ యునైటెడ్ లాంటి దిగ్గజ సంస్థలతోపాటు ఫార్మా, నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.