Prithvi Shaw: టీమిండియా యువ క్రికెటర్, గతంలో అండర్ -19 స్థాయిలో భారత్కు ట్రోఫీని అందించిన ముంబై కుర్రాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. సుమారు ఆరు నెలల తర్వాత అతడు స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్ పండుగ రంజీ ట్రోఫీలో భాగంగా ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి రోజే లంచ్కు ముందే సెంచరీ బాదాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లంచ్కు ముందే శతకం బాదిన రికార్డుతో పాటు కెరీర్లో ఇలా రెండుసార్లు సాధించిన ఘనతనూ షా సొంతం చేసుకున్నాడు. 106 బంతుల్లోనే వంద పరుగులు పూర్తిచేసిన షా.. తొలి ఇన్నింగ్స్లో 185 బంతుల్లో 159 పరుగులు చేశాడు.
గతేడాది ఇంగ్లండ్లో కౌంటీలు ఆడేందుకు వెళ్లి ఒక్క మ్యాచ్ ఆడగానే గాయంతో స్వదేశానికి వచ్చిన షా.. పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తాజా రంజీ సీజన్లో రెండో మ్యాచ్ ఆడుతున్న షా.. ఛత్తీస్గఢ్తో రాయ్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో తొలి రోజు లంచ్కు ముందే సెంచరీ చేశాడు. 2022-23 సీజన్లో కూడా షా.. అసోంతో మ్యాచ్లో ఇలాంటి ఘనతే సాధించాడు. ఆ మ్యాచ్లో షా ఏకంగా 379 పరుగులు చేయడం విశేషం. దేశవాళీ క్రికెట్లో లంచ్కు ముందే సెంచరీలు చేసిన (రెండు సార్లు) తొలి బ్యాటర్గా షా రికార్డులకెక్కాడు.
Guys prithvi Shaw is back 🔥🔥 pic.twitter.com/5amtE9muRa#PakistanElection #bb23
— Ajay 🇮🇳 (@coruptajxy) February 10, 2024
ఈ మ్యాచ్లో ఆది నుంచి దూకుడుగా ఆడిన షా.. ఐపీఎల్ సీజన్ ముందున్న దశలో వేగంగా ఆడటం అతడికి కలిసొచ్చేదే. గత ఐపీఎల్ సీజన్లో షా పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ఆశలు పెట్టుకున్నా అతడు దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో కీలక ఆటగాళ్లను వదులుకున్న ఢిల్లీ.. షా పై మాత్రం నమ్మకముంచింది. మరో నెలన్నర రోజులలో ఐపీఎల్ – 17వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో షా దూకుడుగా చెలరేగడం టీమ్లో అతడి ప్లేస్ను మరింత మెరుగుపరిచేదే. ఈ సీజన్లో కూడా షా విఫలమైతే ఇక అతడు కమ్బ్యాక్ ఇవ్వడం, జాతీయ జట్టుకు ఆడటం కలే అవుతుంది.