జూబ్లీహిల్స్: సౌత్ ఇండియా తైక్వాండో చాంపియన్షిప్లో రంగారెడ్డి ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించారు. బాలికల 46 కేజీల విభాగంలో దర్శిని, 43 కేజీల కేటగిరీలో లాస్య స్వర్ణ పతకాలు ఖాతాలో వేసుకున్నారు. 700 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 24 మంది తెలంగాణ క్రీడాకారులు జాతీయ చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 19 నుంచి తమిళనాడులో జరుగనున్న నేషనల్ పోటీల్లో పాల్గొంటారని సౌత్ ఇండియా తైక్వాండో చాంపియన్షిప్ కార్యదర్శి దండు సురేశ్ పేర్కొన్నారు.