రాజ్కోట్: సౌరాష్ట్ర యువ పేసర్ చేతన్ సకారియా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్తో చేతన్ తండ్రి కాంజీభాయ్ సకారియా(42) భావ్నగర్లో ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కాంజీభాయ్ తుదిశ్వాస విడిచారు. సకారియా తండ్రి మరణం పట్ల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసింది. ‘కుటుంబ పెద్దను కోల్పోయి బాధలో ఉన్న సకారియా కుటుంబానికి ఆ దేవుడు కావాల్సిన మనో ధైర్యాన్నివ్వాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొంది. సౌరాష్ట్రకు 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన 22 ఏండ్ల చేతన్ సకారియా ఈ సీజన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. కాంజీభాయ్ మరణం పట్ల రాయల్స్ కూడా సంతాపం ప్రకటించింది.