Asia Cup 2023 : ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. 24.1వ ఓవర్ సమయంలో వాన మొదలైంది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పరుగెత్తుకొచ్చి పిచ్ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. అప్పటికీ భారత్ స్కోర్.. 147/2. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఆడుతున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.
రోహిత్ శర్మ(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) ఔటైన తర్వాతి ఓవర్లోనే శుభ్మన్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) వెనుదిరిగాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో అఘా సల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, 124 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది.
శుభ్మన్ గిల్(58), రోహిత్ శర్మ(56)
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఫీల్డింగ్ తీసుకున్నాడు. సెప్టెంబర్ 2 న పాక్తో జరిగిన మ్యాచ్లో విఫలమైన గిల్, రోహిత్ పట్టుదలగా ఆడారు. ముఖ్యంగా ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీని టార్గెట్ చేసిన గిల్ 5వ ఓవర్లో ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత నసీం షా వేసిన 9వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో, 15 ఓవర్లకు ఇండియా స్కోర్ 115కి చేరింది.