హైదరాబాద్, ఆట ప్రతినిధి: టెన్నిస్ ప్రీమియర్ లీగ్ టాలెంట్ హంట్లో యువ ప్లేయర్ రహీన్ తర్నమ్ ఆకట్టుకుంది. శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలికల అండర్-18 ఫైనల్లో రహీన్ 10-2 తేడాతో చెవికారెడ్డిపై అలవోక విజయం సాధించింది. టైటిల్తో పాటు టోర్నీ బెస్ట్ ప్లేయర్ అవార్డు, 30వేల నగదును రహీన్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 7 నుంచి మొదలవుతున్న టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టు తరఫున ఈ యువ ప్లేయర్ ప్రాతినిధ్యం వహించనుంది. ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.