మియామి: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఆదివారం ముగిసిన ఎఫ్టిఎక్స్ క్రిప్టో కప్ చెస్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్పై 4-2 తేడాతో విజయం సాధించినా 15 మ్యాచ్ పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. కార్ల్సన్ 16 మ్యాచ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ను సొంతం చేసుకున్నాడు.