కౌలాలంపూర్: మలేషియా ఓపెన్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-13, 21-9 తేడాతో పోర్న్పవి చౌచువాంగ్(థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. 40నిమిషాల్లోనే ముగిసిన పోరులో సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మరోవైపు గాయాలతో సహవాసం చేస్తున్న హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ 11-21, 17-21 ఇరిస్ వాంగ్(అమెరికా) చేతిలో ఓటిమిపాలైంది. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 21-12, 21-17తో హో క్వాంగ్ హి(కొరియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.