బాలి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 17-21, 21-17, 21-17తో అయా ఒహొరి (జపాన్)పై కష్టపడి గెలిచింది. తొలి గేమ్లో వెనకబడినా తర్వాతి రెండు గేమ్ల్లో సింధు పుంజుకుని ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో రౌండ్లో యెన్నె లీ (జర్మనీ)తో సింధు తలపడనుంది. సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో విజయాలు సాధించి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 21-19, 21-18తో తోమ జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-12తో ప్రణయ్ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి- ధ్రువ్ కపిల ద్వయం 7-21, 12-21తో జపాన్ జోడీ యమశిత, షినోయా చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ 27-29, 18-21తో ఐదో సీడ్ బల్గేరియా జంట గాబ్రియెలా, స్టెఫానీ చేతిలో పరాజయం ఎదుర్కొంది. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్ రెడ్డి-అశ్విని జంట నిరాశపర్చింది.