ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లో విజయం సాధించి ముందంజ వేసింది. ఆమెతో పాటు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం విజయాలతో తర్వాత రౌండ్లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్లో సింధు 21-12, 21-10 తేడాతో అలవోకగా గెలిచింది. 30 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రపంచ చాంపియన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత పోటీ పడ్డ తొలి టోర్నీలో సింధు సత్తాచాటింది. మిగతా మ్యాచ్ల్లో కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-11 తేడాతో సాయి ప్రణీత్పై గెలిచాడు. పురుషుల డబుల్స్లో భారత జోడీ మను అత్రి, సుమిత్ రెడ్డి 18-21, 11-21తో మలేషియా ద్వయం గో షిఫె, నూర్ ఇజుద్దీన్ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్లో సమీర్వర్మ 21-17, 21-14తో విదిత్సరన్(థాయ్లాండ్)పై గెలిచి ముందం జ వేశాడు. డబుల్స్లో స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి 23-21, 21-15తో ఇంగ్లండ్ జంట హెమ్మిం గ్, స్టాల్వుడ్పై గెలిచింది. ఎమ్ఆర్ అర్జున్, ధృవ్ కపిల్ జోడీ, మిక్స్డ్ డబుల్స్లో ధృవ్ కపిల, సిక్కిరెడ్డి ద్వయం విజయాలతో తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది.