మాడ్రిడ్: మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-12తో హువాంగ్ యు సన్(చైనీస్ తైపీ)పై అలవోక విజయం సాధించింది. 36 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. గతేడాది ఇదే టోర్నీలో రన్నరప్గా నిలిచిన ఈ తెలుగు షట్లర్ క్వార్టర్స్లో సుపనిద కేతాంగ్ లేదా నసుకి నిదైరాతో తలపడనుంది.