బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు థాయ్లాండ్ ఓపెన్లో నిరాశ ఎదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 సెమీఫైనల్లో సింధు పోరాడి ఓడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సింధు 17-21, 16-21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూ ఫీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. 43 నిమిషాల్లో ముగిసిన పోరులో తెలుగమ్మాయి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అనవసర తప్పిదాలు చేస్తూ వరుస గేమ్ల్లో ఓటమి పాలైంది. తొలి గేమ్ ఆరంభంలో ఇరువురు షట్లర్లు హోరాహోరీగా పోరాడినా.. బ్రేక్ సమయానికి చెన్ 11-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరు కొనసాగిస్తూ.. 17-12తో విజయానికి చేరువైన చైనా షట్లర్ సునాయాసంగానే గేమ్ దక్కించుకుంది. ఇక రెండో గేమ్ ఆరంభంలో 6-3తో ఆధిక్యంలో నిలిచిన సింధు.. 10-5తో గేమ్ను ముంగిచేలా కనిపించింది. అయితే అనూహ్యంగా పుంజుకున్న చెన్.. వరుస పాయింట్లు కొల్లగొడుతూ సింధును ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్ను కైవసం చేసుకుంది.