ఒడెన్సే : ఈ ఏడాది తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధుకు మరోసారి నిరాశే మిగిలింది. డెన్మార్క్ ఓపెన్ సెమీఫైనల్లోనే సింధు పోరా టం ముగిసింది. తనకంటే మెరుగైన ర్యాంకర్ కరోలిన్ మారిన్ చేతిలో భారత షట్లర్ చిత్తుగా ఓడిపోయింది. శనివారం జరిగిన మ్యాచ్లో మారిన్ దూకుడు ముందు నిలవలేక సింధు18-21, 21-19, 7-21తో పరాజయం పాలైంది.