ఒడెన్సే : డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో తెలుగు తేజం పీవీ సింధు అదరగొడుతున్నది. గురువారం ఇండోనేషియా షట్లర్ గ్రెగోరియా మరిస్కా టున్జంగ్ను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గంట 11 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో 18-21తో తొలి సెట్ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత చాంపియన్ ఆటతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.
వరుసగా రెండు సెట్లను 21-15, 21-13తో సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఏడాది తనను రెండుసార్లు ఓడించిన గ్రెగోరియాపై సింధు ప్రతీకార విజయం సాధించింది. సెమీస్ బెర్తు కోసం .. ఆకర్షీ కశ్యప్(భారత్), సుపనిందా కటెథోంగ్ (థాయ్లాండ్) మ్యాచ్ విజేతతో సింధు తలపడనుంది. ఈమధ్యే ఆర్కిటిక్ ఓపెన్లో సెమీస్లోనే వెనుదిరిగిన ఈ స్టార్ షట్లర్ ఈసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.