బ్యాంకాక్: థాయిలాండ్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు నెగ్గి క్వార్టర్స్లోకి దూసుకెళ్లగా.. థామస్ కప్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అనూహ్య నిర్ణయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. సింధు మినహా అన్నీ విభాగాల్లో భారత షట్లర్లందరూ టోర్నీ నుంచి వైదొలిగారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో తెలుగమ్మాయి 21-16, 21-13 తేడాతో సిమ్ యు జిన్ (కొరియా)ను చిత్తు చేసింది.
ఆరంభం నుంచి దూకుడుతో రెండు గేమ్లను చేజిక్కించుకుని ముందంజ వేసింది. అకానె యమగుచి (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల పోరు రెండో రౌండ్లో 11వ ర్యాంకర్ శ్రీకాంత్ అనూహ్యంగా ఆట నుంచి వైదొలిగాడు. దీంతో వాకోవర్ పద్ధతిలో ప్రత్యర్థి ముందంజ వేయగా.. శ్రీకాంత్ టోర్నీ నుంచి వైదొలిగాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మాళవిక బన్సూద్ 21-16, 14-21, 14-21తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోగా.. డబుల్స్లో అశ్వినీ భట్-శిఖా గౌతమ్ ద్వయం నిరాశపర్చింది. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్-తనీషా క్రాస్టో జోడీ 19-21, 20-22తో మలేసియా బృందం చేతిలో చిత్తయ్యింది.