దుబాయ్: వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మంగళవారం ఆటగాళ్ల వేలం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ వేలంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఫ్రాంచైజీ పొరపాటు చేసింది. అనుకోకుండా తప్పుడు ప్లేయర్ను కొనుగోలు చేసింది. 20 లక్షల బేస్ ప్రైజ్లో భారత క్రికెటర్ శశాంక్ సింగ్ను ఆ ఫ్రాంచైజీ సొంతం చేసుకున్నది. నిజానికి పంజాబ్ కింగ్స్ ఆ క్రికెటర్ పట్ల ఆసక్తి చూపలేదు. కానీ పొరపాటు పడ్డ ప్రీతి జింతా టీమ్.. శశాంక్ను కొనేసింది. ఇదంతా వేలం జరుగుతున్న సమయంలో క్షణాల్లో జరిగిపోయింది. పంజాబ్ యాజమాన్యం పొరపాటను గ్రహించినా.. అప్పటికే ప్లేయర్ అమ్ముడుకావడంతో.. వేలం వేసిన మల్లికా సాగర్ కూడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు.
వేలం టేబుల్పై కూర్చున్న ప్రీతి జింతా, నెస్ వాదియా పొద్ద పొరపాటే చేశారు. చత్తీస్ఘడ్ ప్లేయర్ శశాంక్ సింగ్ ను ఇష్టం లేకున్నా కొనాల్సి వచ్చింది. వేలం వ్యూహాంలో పొరపాటు జరిగినట్లు ఆ తర్వాత పంజాబ్ ఫ్రాంచైజీ అంగీకరించింది. గుర్తింపులేని ఆటగాళ్ల కోసం వేలం జరుగుతున్న సమయంలో శశాంక్ సింగ్ను కొనేశారు. టీమ్తో డిస్కస్ చేసిన తర్వాత ప్రీతి జింతా వేలంలో పాల్గొన్నది. అయితే శశాంక్ను కొనేందుకు మిగితా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో క్షణాల్లోనే శశాంక్ను పంజాబ్ జట్టు కైవసం చేసుకున్నది. మరో ప్లేయర్కు బదులుగా శశాంక్ను ఖరీదు చేసినట్లు నెమ్మదిగా ప్రతీ జింతా టీమ్ గుర్తించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్లేయర్ అమ్ముడుపోయిన తర్వాత ఏం చేసేది లేదని మల్లిక అన్నారు. ప్లేయర్ మీద ఇష్టం లేకున్నా.. పంజాబ్ అతన్ని జట్టులో చేర్చుకోవాల్సి వచ్చింది.
Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H
— Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023