బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో టైటాన్స్ 33-34తో పుణెరి పల్టన్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు. పుణెరి తరఫున మోహిత్ (9 పాయింట్లు), అస్లమ్ (8 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో యూపీ యోధ 36-35తో పట్నా పైరెట్స్పై విజయం సాధించగా.. ఆఖరి పోరులో జైపూర్ 40-38తో హర్యానాను చిత్తుచేసింది.