PCB chief : కరాచీలో ఉగ్రదాడి ప్రభావం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పై ఉండదని ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజం సేథీ అన్నాడు. ఈ మేరకు అతను ఒక ప్రకటన విడుదల చేశాడు. భారీ భద్రత నడుమ మ్యాచ్లు నిర్వహిస్తామని అతను స్పష్టం చేశాడు. ‘షెడ్యూల్ ప్రకారం పీఎస్ఎల్ మ్యాచ్లు జరుగుతాయి. అంతేకాదు ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తాం’ అని నజం సేథీ వెల్లడించాడు.
పీసీబీ మరొక సభ్యుడు, భద్రతా దళాలతో పాటు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా కరాచీలో తదుపరి పీఎస్ఎల్ మ్యాచ్ల నిర్వహణకు అంగీకరించారు. మూడు మ్యాచుల్లో రెండు కరాచీలోని స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే.. ఉగ్ర దాడి కారణంగా మ్యాచ్ల నిర్వహణపై స్తబ్ధత నెలకొంది. దాంతో, పీసీబీ చీఫ్ ఈరోజు స్పందించాడు.
కరాచీపై ఉగ్రదాడిని భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విట్ర్ వేదికగా తీవ్రంగా పరిగణించాడు. ఉగ్రవాదులను ఏరిపారేయడంలో ఆ దేశ ఉదాసీన వైఖరిని అతను ప్రశ్నించాడు. ‘మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే ఇదే జరుగుతుంది. టెర్రరిజాన్ని అరికట్టడంలో పాక్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉంది’ అని అతను ట్వీట్లో రాసుకొచ్చాడు. వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 17న (శుక్రవారం) సాయంత్రం కరాచీలోని పోలీస్ప్రధాన అధికారి కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దాంతో, ఒక్కసారిగా ఆ సిటీ ఉలిక్కి పడింది. పోలీసులు జరిపిన ప్రతి దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులను తుద ముట్టించే క్రమంలో భద్రతా దళానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితమే పెషావర్లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.
When you breed terrorist, this is what will come back. Feel sad for innocent people who lose their lives because the country is unable to have intolerance towards terrorism. #Karachi https://t.co/YteQfvTjNz
— Venkatesh Prasad (@venkateshprasad) February 17, 2023